Karnataka | బెంగళూరు, జనవరి 5: రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కాకుండా కొందరు వ్యక్తుల పేరిట శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడంలోని పవిత్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
అంబేద్కర్, బసవేశ్వర, బుద్ధుడు వంటి వారిని దైవాంశ సంభూతులుగా పరిగణిస్తారని, రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో పేర్కొన్న ‘గాడ్’ అనే ఇంగ్లిష్ పదం కూడా ఇంచుమించు దీనినే సూచిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంతేకాకుండా దేవుడి పేరు ప్రస్తావించనక్కర్లేకుండా ప్రమాణం చేసేందుకు కూడా రాజ్యాంగం అనుమతి ఉందని తెలిపారు.