లక్నో: రాబోయే సాధారణ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి చెప్పారు. తాము ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని ఆమె తెగేసి చెప్పారు. కాంగ్రెస్తోపాటు మరికొన్ని ఇతర పార్టీలు తమతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ ఆ విషయంలో తమ ఐడియాలజీ పూర్తి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈవీఎంల గురించి కూడా మాయావతి మాట్లాడారు. ఈవీఎంలలో ఏదో లోపం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. బ్యాలట్ పేపర్ టైమ్లో తమ పార్టీ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం ఎన్నికఎన్నికకూ పెరుగుతూ ఉండేదని చెప్పారు. ఇకనైనా ఎన్నికలను బ్యాలట్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.