లక్నో: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి ఓట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయించాం. తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడంలేదు. అలాగని ప్రతిపక్షాలకూ వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం’ అని మాయావతి చెప్పారు. కాగా, మద్దతు అంశంపై ప్రతిపక్షలు తమను సంప్రదించలేదని వెల్లడించారు.
కాగా, ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ముర్ముకి ఇప్పటికే ఎన్డీయే పక్షాలు కాకుండా బిజూ జనతాదళ్, వైఎస్ఆర్సీపీ, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జే) వంటి పార్టీ మద్దతు పలికాయి. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగునున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీచేస్తున్న విషయం తెలిసిందే.