Drone @ Attari | పంజాబ్లోని అట్టారీ వద్ద భారత్-పాక్ సరిహద్దుల్లో గురువారం డ్రోన్ తిరగడం కలకలం రేపింది. ఈ సంగతి గమనించిన సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) సదరు డ్రోన్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి.
దీంతో డ్రోన్ తిరిగి పాకిస్థాన్కు వెళ్లిపోయింది. డ్రోన్ తిరుగాడిన ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.