కంకేర్, మే 27: ఛత్తీస్గఢ్లో శుక్రవారం బీఎస్ఎఫ్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కంకేర్ జిల్లాలోని ఉర్పాంఝుర్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మావోయిస్టుల కదలికలపై స మాచారం అందడంతో బీఎస్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా మా వోయిస్టులు కాల్పులు జరిపారని, ప్ర తిగా బీఎస్ఎఫ్ బలగాలు కూడా కా ల్పులు జరిపినట్టు చెప్పారు.
ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా నక్సలైట్ కాళ్ల కు బుల్లెట్ గాయాలై ఘటనా స్థలం వ ద్దే పోలీసులకు చిక్కిందని, వికాస్ సింగ్, మన్లిక్రామ్ అనే ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గా యాలైనట్టు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక సింగిల్ షాట్ రైఫిల్, ఐఈడీతో కూడిన ఆరు ప్రెషర్ కుక్కర్లు, పేలుడు పదార్థాలు, మావోయిస్టుల దుస్తులు, కరపత్రాలు, ఔషధాలు స్వా ధీనం చేసుకున్నట్టు చెప్పారు. గాయపడ్డ మహిళా మావోయిస్టు స్థానిక దళసభ్యురాలు ఫగ్ని పొడియమిగా గుర్తించామని, ఆమెపై లక్ష రూపాయల రివార్డు ఉన్నదని తెలిపారు.