రాయ్పూర్ : చత్తీస్ఘఢ్ (Chhattisgarh Polls) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మంగళవారం జరగనుండగా సరిగ్గా ఒకరోజు ముందు కాంకేర్లో నక్సల్స్ ఐఈడీ పేలుడుకు తెగబడ్డారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్తో పాటు పోలింగ్ ఏజెంట్లు గాయపడ్డారు.
గాయపడిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ను ప్రకాష్ చంద్గా గుర్తించారు. ఐఈడీ పేలుడులో మరో ఇద్దరు పోలింగ్ అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. కాంకేర్ జిల్లాలోని క్యాంప్ మర్బెద నుంచి బీఎస్ఎఫ్, జిల్లా అధికారుల బృందం రెంగఘాటి రెంగగొండి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ టీంతో కలిసి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఇక 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్ఘఢ్ అసెంబ్లీకి ఈనెల 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.కాగా, కాగా, చత్తీస్ఘఢ్తో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
Read More :
Katrina kaif | హాట్ టాపిక్గా కత్రినాకైఫ్ టవల్ ఫైట్ సీన్.. సల్మాన్ ఖాన్ టైగర్ 3పై సూపర్ హైప్