ముంబై, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): నాసిక్ జిల్లా నందగావ్ తాలుకాలోని నాయ్డొంగరి, బార్బీ, బాణ్గావ్ తదితర గ్రామాలను కరువు గ్రామాలుగా ప్రకటించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆ పార్టీ పశ్చిమ మహారాష్ట్ర సమన్వయకర్త నానాసాహెబ్ బచ్చావ్ నందగావ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అప్పాసాహెబ్ బచ్చావ్, ప్రకాష్ వాగ్మారే, గరుడ్ సాహెబ్, మన్సూరి సాహెబ్, అహిరే, బాలాసాహెబ్ బచ్చావ్, ఏక్నాథ్, అజయ్ బచ్చావ్ పాల్గొన్నారు.