CM KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ మహారాష్ట్రలో తొలి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నది. నాగపూర్లో పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏపీలోనూ కార్యాలయం ప్రారంభమైంది. తాజాగా మహరాష్ట్రలోని నాగపూర్లో కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్, నాందేడ్ పట్టణాల్లోనూ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
BRS Party President, CM Sri KCR will inaugurate BRS Party Nagpur office tommorow. pic.twitter.com/FvYu8wyp0J
— Balka Suman (@balkasumantrs) June 14, 2023