న్యూఢిల్లీ: అదానీ సంక్షోభం(Adani Issue)పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)తో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఇవాళ పార్లమెంట్ ఆవరణలో భారత రాష్ట్ర సమితి ఎంపీలు(BRS MPs) ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ రెండో దఫా సమావేశాలు గత అయిదు రోజుల నుంచి సాగుతున్న .. ఒక్క రోజు కూడా సభా కార్యక్రమాలు జరగలేదు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లోనూ అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
అదానీ స్కామ్పై జేపీసీ వేయాలని కోరుతూ.. పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీల నిరసన.. @BRSparty pic.twitter.com/jkM6c9Ux5T
— Namasthe Telangana (@ntdailyonline) March 17, 2023
ఇవాళ పార్లమెంట్ ఆవరణలోనూ భారీ స్థాయిలో రాజ్యసభ ఎంపీలు(Rajya Sabha MPs) తమ గళం వినిపించారు. జేపీసీ వేయాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ సభాపక్ష నేత కే కేశవరావుతో పాటు సంతోష్, వెంకటేశ్ నేత, సురేశ్ రెడ్డి, వడ్డిరాజు రవిచంద్రలు ప్రదర్శనలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం(Gandhi Statue) దగ్గర జరిగిన ప్రదర్శనలో ఎంపీ సంతోష్ కుమార్ డప్పు వాయించారు. ఇతర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు.
అదానీ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonai Gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
#WATCH | Delhi: Opposition MPs, including Congress president-Rajya Sabha LoP Mallikarjun Kharge and UPA chairperson Sonia Gandhi, protest in the Parliament premises and demand a JPC inquiry into the Adani Group issue.
Congress MP Rahul Gandhi is also at the protest. pic.twitter.com/aEZhN2z1BH
— ANI (@ANI) March 17, 2023