న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సభ నుంచి వెళ్లిపోతున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు.