ఆదిలాబాద్ : బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మహారాష్ట్రవాసులు సంబరాలు జరుపుకున్నారు. నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా పాటోథా గ్రామస్థులు బీఆర్ఎస్ , ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. జై బీఆర్ఎస్, జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని దేశానికి ఆయన నాయకత్వం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
‘ఆప్ కీ బార్ కిసాన్ కి సర్కార్’ అనే నినాదంతో కేసీఆర్ ప్రధాని అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు.కేసీఆర్ తెలంగాణ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. పేదల ఆడపిల్లల వివాహాలకు రూ. లక్ష అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాన్ని తెలంగాణలో కలపాలని కోరారు.