టెలికాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 25: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయం నుంచి వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, దవాఖానల సూపరింటెండెంట్లతో నిరంజన్రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ తరుగుతీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల వద్ద ప్ర భుత్వం సూచించిన కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యే లా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చని, పాజిటివ్ వచ్చిందనగానే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు.