న్యూఢిల్లీ, జూన్ 23: అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను బ్రిక్స్ దేశాలు గౌరవిస్తాయని కూటమి దేశాల అధినేతలు పేర్కొన్నారు. చైనా అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరిగింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గానిస్థాన్లో భద్రతా సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్లో సంక్షోభానికి చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండియా బ్రిక్స్లో సభ్యదేశాలుగా ఉన్నాయి.