భోపాల్ : మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో దేశంలోనే కార్యకలాపాలు సాగిస్తున్న ఏకైక డైమండ్ మైన్లో విలువైన వజ్రాల నిక్షేపాలున్నాయి. జిల్లాలో గత ఏడాది ఓ కూలీకి రూ 30 లక్షల నుంచి రూ 35 లక్షల విలువైన మూడు డైమండ్స్ దొరకడంతో అతడు రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు. అంతకుముందు ఓ వ్యక్తికి 10.69 క్యారెట్ డైమండ్ దొరికింది. ఈసారి చిన్న ఇటుక బట్టీని నిర్వహించే చిరు వ్యాపారిని అదృష్టం వరించింది. మైన్లో ఇతడికి 26.11 క్యారెట్ డైమండ్ లభించిందని సంబంధిత అధికారి మంగళవారం వెల్లడించారు.
పట్నాలోని కిషోర్గంజ్ వాసి సుశీల్ శుక్లాకు ఖరీదైన డైమండ్ దొరకడంతో అతడి ఆనంధానికి అవధుల్లేవు. కృష్ణ కళ్యాణ్పూర్ ప్రాంతానికి సమీపంలోని మైన్లో శుక్లాకు అతడి భాగస్వాములకు ఈ డైమండ్ లభించింది. ఈ డైమండ్ విలువ రూ 1.2 కోట్లు పలుకుతుందని అధికారి రవి పటేల్ తెలిపారు. డైమండ్ను రెండు మూడు రోజుల్లో వేలం వేస్తారని చెప్పారు. వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత మైన్ యజమానికి అందచేస్తారు. కిషోర్ గంజ్లో చిన్న ఇటుక బట్టీని శుక్లా నిర్వహిస్తుండగా ఆయన కుటుంబం గత 20 ఏండ్లుగా డైమండ్ మైనింగ్ పనులు చేపడుతోంది.
డైమండ్ వేలం ద్వారా వచ్చిన మొత్తంతో తాను నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తానని శుక్లా చెప్పుకొచ్చారు. 2018లో కృష్ణ కళ్యాణ్పూర్ ట్టి గ్రామంలో రూ 1.5 కోట్ల విలువైన డైమండ్ లభించడంతో 50 ఏండ్ల బుందేల్ఖండ్ కూలీ మోతీలాల్ ప్రజాపతి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బుందేల్ఖండ్ జిల్లా మైన్స్ చరిత్రలో ఇంతటి విలువైన వజ్రం దొరకడం అదే తొలిసారి. తమ తాతల కాలం నుంచి తాము మైనింగ్ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకున్నా గతంలో ఎన్నడూ తమకు వజ్రాలు లభించలేదని మోతీలాల్ చెప్పుకొచ్చాడు. దేవుడి ఆశీస్సులతో భారీ ధర పలికే డైమండ్ లభించిందని, ఈ డబ్బుతో పిల్లలకు ఉన్నత విద్యతో పాటు తల్లితండ్రుల బాగోగులు చూసుకుంటామని, సొంత ఇల్లు సమకూర్చుకుని సోదరుడి కూతుళ్ల పెండ్లి చేస్తామని మోతీలాల్ వెల్లడించాడు.