న్యూఢిల్లీ: ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ స్థాయిలను గుర్తించాలంటే సిరంజి ద్వారా రక్తం తీసి.. గ్లూకోమీటర్తో పరీక్షించాల్సిందే. రక్తాన్ని సేకరించే అవసరం లేకుండా, కేవలం శ్వాసతో చక్కెర స్థాయిలను తెలిపే పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటీ-మండీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
మొదటగా వీరు తయారుచేసిన పరికరంలో మనం శ్వాసను ఊదాలి. ఇలా ఊదిన శ్వాస నమూనాలను బెలూన్స్లో నింపుతారు. ఆ తర్వాత పరికరం షుగర్ స్థాయితోపాటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ.. వివరాలను కూడా అందజేస్తుందని పరిశోధకులు చెప్పారు.