లక్నో : తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణులను యూపీలోని లక్నోలో తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. లక్నోలో ప్రతి కుటుంబానికి పీఎన్జీ గ్యాస్ సమకూరుస్తామని చెప్పారు. తన నియోజకవర్గం లక్నోలో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ రూ 1700 కోట్ల విలువైన 180 ప్రాజెక్టులను ఆవిష్కరించారు.
లక్నోను అత్యున్నత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టామని చెప్పారు. సీఎం యోగి ఆదిత్యానాధ్ సహకారంతోనే ఈ కార్యక్రమాలు అమలుకు నోచుకున్నాయని అన్నారు. యోగి సారధ్యంలో యూపీ అభివృద్ధి పధంలో పయనిస్తోందని అన్నారు. కొవిడ్-19తో అనాధలైన పిల్లల బాగోగులు చూసేందుకు యోగి చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని రాజ్నాధ్ కితాబిచ్చారు.