Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో విజేందర్ సింగ్ కాషాయ పార్టీలో చేరారు. ఇక అంతకుముందు మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్(MP Sumalatha Ambareesh) బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు.
దీంతో ఆమె రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూటమికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పేశారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు సుమలత తెలిపారు.
2019 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్పై సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే.కేంద్రంలోని బీజేపీ సర్కారు మాండ్య లోక్సభ నియోజకవర్గానికి 4 వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసినట్లు సుమలత వెల్లడించారు. కాగా, బీజేపీ నుంచి రాజ్యసభకు సుమలత వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read More :