చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంపై కార్యకర్తలు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆయన వేదిక నుంచి వెళ్లిపోతుండగా.. వాటర్ బాటిళ్ల దాడి జరిగింది. మాజీ సీఎంను ఈ దాడి నుంచి కాపాడేందుకు వలయంగా ఏర్పడ్డ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై వాటర్ బాటిళ్లు పడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య జనరల్ కౌన్సిల్ ప్రతిపాదించిన 23 తీర్మానాలు తిరస్కరించబడ్డాయి. పార్టీకి ఒకే నాయకత్వ వ్యవస్థను తీసుకురావాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు మళ్లీ జులై 11వ తేదీన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కానుంది.
#WATCH | Tamil Nadu: Bottles hurled at AIADMK coordinator and former Deputy CM O Panneerselvam at the party’s General Council Meeting today. The meeting took place at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram in Chennai.
He walked out halfway through the meeting. pic.twitter.com/lVb1AdvAGt
— ANI (@ANI) June 23, 2022