ముంబై: అవినీతి కేసులో తమను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు ఈ నెల 6న విచారణ జరపనుంది. కొచ్చర్ దంపతుల పిటిషన్ను విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు.. వారి పిటిషన్పై సమాధానం ఇవ్వాలని అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐని ఆదేశించింది.
చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియో కాన్ కంపెనీకి ఆమె సుమారు రూ.2,000 కోట్ల రుణం మంజూరు చేశారు. ఈ సందర్భంలో చందా కొచ్చర్కు భారీగా డబ్బు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సీబీఐ అధికారులు చందా కొచ్చర్ను, ఆమె భర్త దీపక్ కొచ్చర్ను, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు జరుపుతోంది.
ఈ క్రమంలో కొచ్చర్ దంపతులు అవినీతి కేసులో తమ అరెస్ట్ను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అదేవిధంగా కేసు నుంచి తమకు తాత్కాలింగా ఉపశమనం కల్పించాలని కోరారు. దీనిపై సీబీఐ నుంచి సమాధానం కోరిన బాంబే హైకోర్టు.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.