రెండు కుటుంబాల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తి.. ఎదుటి కుటుంబం ఉంటున్న ఇంటిపై బాంబు విసిరాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో కాసేపటికి తన ఇంటి నుంచి ఒక బాంబు తీసుకొచ్చిన ఒక వ్యక్తి.. తన ప్రత్యర్థి కుటుంబం ఉంటున్న ఇంటిపై విసిరాడు.
ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో ఉన్న మిగతా ఇళ్లపై కూడా రెయిడ్లు చేశారు. ఇంకా ఎవరైనా తమ ఇళ్లలో బాంబులు దాచారేమో అని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.