పాట్నా: మరో బాలీవుడ్ నటి రాజకీయాల్లో అడుగుపెట్టనుంది. బీహార్లోని భాగల్పూర్ (Bhagalpur) లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ నటి పోటీయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బాలీవుడ్ నటి నేహా శర్మ (Neha Sharma) భాగల్పూర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె తండ్రి భాగల్పూర్ ఎమ్మెల్యే అజయ్ శర్మ తెలిపారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి దక్కినట్లయితే తన కూతురు, బాలీవుడ్ నటి నేహా శర్మను అభ్యర్ధిగా ప్రతిపాదిస్థానని చెప్పారు. అలా కాకుండా పార్టీ తననే పోటీచేయాలని కోరితే బరిలో నిలబడతానని వెల్లడించారు.
నేహా శర్మ.. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన క్రూక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆమె తానాజీ, యమ్లా పాగ్లా దీవానా-2, తుమ్బిన్-2, ముబారకన్ వంటి సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నేహకు.. ఇన్స్టాగ్రామ్లో 2.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.