భోపాల్, అక్టోబర్ 20: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో వైద్య సదుపాయాలు మృగ్యంగా మారాయి. ప్రమాదంలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఛాతర్పూర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు పంపించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పాప మేనమామ మృతదేహాన్ని గ్రామానికి తీసుకుపోయేందుకు వాహనం కోసం ప్రయత్నించగా.. దవాఖాన అంబులెన్స్ అందుబాటులో లేదు.
ప్రైవేటు వాహన ఖర్చును భరించలేని ఆ వ్యక్తి, చేసేదేంలేక పాప మృతదేహాన్ని భుజాలపై వేసుకొని బస్టాండ్కు వెళ్లాడు. అలాగే బస్సు ఎక్కి గ్రామానికి వెళ్లాడు. పాప మృతదేహంతో ఆ మేనమామ రద్దీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.