ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రభుత్వ రంగ సంస్థల సబ్సిడరీల్లో
వాటాల అమ్మకానికి కేంద్ర సర్కారు కుట్ర
న్యూఢిల్లీ, మే 18: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ (వ్యూహాత్మక, మైనారిటీ వాటాల విక్రయం), యూనిట్ల మూసివేతపై సిఫారసు చేయడానికి కేంద్రప్రభుత్వం ఆయా కంపెనీల మాతృ సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు అధికారం కల్పించింది. అవసరమైతే ‘దీపం’ అనుమతులతో సంబంధం లేకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపింది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మరోవైపు, జీవ ఇంధనాల పాలసీని కేంద్రం సవరించింది. 2030 కల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి(ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్) సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని ఐదేండ్లు ముందుకు జరిపింది. 2025-26 వరకే లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది.