భువనేశ్వర్: ఒడిశాలో అధికార బీజేపీ నేతలు పేట్రేగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ కార్యాలయాల్లోనే దాడులకు దిగుతున్నారు. ఓ మున్సిపల్ అధికారిని అంతా చూస్తుండగానే తన చాంబర్ నుంచి గల్లా పట్టి గుంజుకొచ్చి విచక్షణా రహితంగా దాడిచేశారు. రత్నాకర్ సాహూ (Ratnakar Sahoo) అనే అధికారి భువనేశ్వర్ (Bhubaneswar) మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విధులకు హాజరైన ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో బీఎంసీ ఆఫీస్కు వచ్చిన ఆరుగురు ఆయనను తన చాంబర్లో ఈడ్చుకెళ్లారు.
అనంతరం అక్కడికి చేరుకున్న బీఎంసీ కార్పొరేటర్ జీవన్ రౌత్.. జగ్ భాయ్ (బీజేపీ నాయకుడు జగన్నాథ్ ప్రధాన్)తో అమర్యాదగా ప్రవర్తిస్తావా అని అధికారిని చేయిచేసుకున్నాడు. దీంతో ఆయన అనుచరులు ఆ అధికారిని తన చాంబర్లో నుంచి కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. మొహంపై పిడిగుద్దులు గుద్దుతూ మెట్లపై నుంచి కిందికి తోసేశాడు. దీంతో పడిపోయిన ఆయనను గల్లా పట్టుకుని అలాగే ఈడ్చుకెళ్లారు. ఛాతీపై కాలుతో తన్నారు. బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకులను ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.
కాగా, తనపై దాడి చేసిన బీజేపీ నాయకులు, బలవంతంగా వారి వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని సాహూ తెలిపారు. తాను ఎవరితో అమర్యాదగా ప్రవర్తించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. కార్పొరేటర్ జీవన్ రౌత్తోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు.
I am utterly shocked seeing this video.
Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C
— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025