న్యూఢిల్లీ: పాత ఢిల్లీలోని చాందిని చౌక్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రమంగా అవి పక్కనున్న షాప్లకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40 ఫైరింజన్లతో రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి హాని జరుగలేదని అధికారులు వెల్లడించారు. బిల్డింగ్లోని చాలా షాపులు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
The situation is not very good as of now. 40 fire tenders are present at the spot. The fire will be brought under control by morning. No casualties have been reported so far. A major part of the building has been damaged: Atul Garg, Delhi Fire Service Director https://t.co/BcU4Qd9wUT pic.twitter.com/yroJhxLzo6
— ANI (@ANI) November 24, 2022