త్రిసూర్: బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి లీడింగ్లో ఉన్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 1500 ఓట్ల తేడాతో సురేశ్ గోపి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నీమమ్, పాలక్కాడ్ స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. పాలక్కాడ్లో మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. మరోసారి కేరళలో లెఫ్ట్ వేవ్ కొనసాగనున్నది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. 140 స్థానాల కేరళ అసెంబ్లీలో.. ఎల్డీఎఫ్ 88 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. కాంగ్రెస్ కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది.