జైపూర్: కేంద్రంలోని బీజేపీ పాలకులపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate – ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation – CBI), ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ (Income Tax – (IT) department) పూర్తిగా బీజేపీ అగ్ర నేతల అదుపాజ్ఞల్లో ఉన్నాయని ఆయన ఆరోపించారు.
బీజేపీ అగ్ర నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారని అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు మన దేశానికి గర్వకారణమని, అలాంటి సంస్థలు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తమపని తాము చేసుకుపోతే ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. బన్స్వారా పర్యటనలో మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Rajasthan: BJP’s political bosses ED, CBI and IT threaten them all and send them everywhere. ED, CBI and IT are prestigious agencies of our country, we will be happy if they do their work honestly: Rajasthan Chief Minister Ashok Gehlot in Banswara pic.twitter.com/Eqd1d6soxE
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2023