బెంగుళూరు: ప్రధాని మోదీ ఓ విషపూరితమైన పాము అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. కాల్బుర్గిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ విషపూరిత పాము లాంటి వ్యక్తి అని, ఆ పాములో విషం ఉందో లేదో అని మీరు ఆలోచిస్తుంటారని, కానీ మీరు దాన్ని తాకితే, మీరు చనిపోతారని ఎన్నికల సభలో ఖర్గే కామెంట్ చేశారు. అయితే ఆ కామెంట్ను ఇప్పుడు ఖర్గే మార్చేశారు.
తానేమీ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, బీజేపీ ఐడియాలజీ పాము లాంటిదని చెప్పడం తన ఉద్దేశం అని ఇవాళ ఖర్గే మీడియాతో అన్నారు. ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా తానేమీ వ్యాఖ్యలు చేయలేదని ఖర్గే తెలిపారు. బీజేపీ ఐడియాలజీ పాము లాంటిదని, ఒకవేళ మీరు టచ్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు చనిపోతారని ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.