BJP | న్యూఢిల్లీ: ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆప్ను దారుణంగా దెబ్బతీసేందుకు భారీ ప్లాన్ వే సినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సిసోడియా వంటి కీలక నేతలను అరెస్టు చేయించిన బీజేపీ.. అసలు దేశంలో ఆప్ ఉనికి లేకుండా చేయాలని, ఢిల్లీలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని దించేసేందుకు ప్రణాళికలు వేసినట్టు కమలం పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇందుకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, సీఎం కేజ్రీవాల్పై నిత్యం అవినీతి ప్రచారం చేయాలని ఓ ‘400 రోజుల ప్లాన్’ రచించినట్టు బీజేపీ వర్గాలే చెప్తున్నాయి. ఓ సీనియర్ బీజేపీ నేత ఒకరు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ను ఓ అవినీతిపరుడిగా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2025 వరకు దీన్ని కొనసాగిస్తామని చెప్పారు. 10 భారీ స్కామ్లతో కేజ్రీవాల్ను సవాల్ చేస్తుంటామని మరో నేత పేర్కొన్నారు.