శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం జిల్లాలో హోంషాలి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ జావీద్ అహ్మద్ దార్ను మంగళవారం ఉగ్రవాదులు కాల్పిచంపారు. బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రదాడిని జమ్ము కశ్మీర్ బీజేపీ విభాగం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల చర్య సిగ్గుచేటని, ఇది పిరికిపంద చర్యని బీజేపీ అభివర్ణించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.