లక్నో, సెప్టెంబర్ 1: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో శుక్రవారం ఉదయం ఓ 30 ఏండ్ల యువకుడి మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కౌశల్ కిషోర్ ఇంట్లో వినయ్ శ్రీవాస్తవ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలి నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ఇండ్లు మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్దిగా తెలుస్తున్నది. కాగా, స్వాధీనం చేసుకొన్న తుపాకీ లైసెన్స్ వికాస్ కిషోర్ పేరుపై ఉన్నదని, అయితే తన కుమారుడు గురువారం సాయంత్రమే లక్నో నుంచి ఢిల్లీ వెళ్లాడని మంత్రి కౌశల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినయ్ శ్రీవాస్తవ మంత్రి కుమారుడి స్నేహితుడని బాధితుడి సోదరుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఘటన జరిగిన ఇంట్లో నివాసం ఉంటున్న నలుగురు వ్యక్తులతో జరిగిన ఘర్షణలో తన సోదరుడికి కాల్చిచంపారని పేర్కొన్నారు.