బిహార్లో కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ- జేడీయూ మధ్య ఈ విషయంపైనే కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాతే బీజేపీ కుల గణనకు ఓకే చెప్పింది. తాము కచ్చితంగా కుల గణనకు మద్దతిస్తామని సీఎం నితీశ్కు బీజేపీ అధిష్ఠానం ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి కచ్చితమైన హామీ లభించడంతో జూన్ 1న కుల గణనపై సీఎం నితీశ్ అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు.
మిత్ర పక్షమైన బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం నితీశ్కుమార్ సోమవారం ప్రకటించారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొన్న తర్వాత ప్రతిపాదనను రాష్ట్ర క్యాబినెట్ ముందుకు తీసుకువస్తామని చెప్పారు.
ఈ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్టు తెలిపారు. బీహార్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కుల జనగణనకు మద్దతిస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పడంతో జూన్ 1 న అఖిలపక్షం జరగనుంది.