బెంగళూరు, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని స్వయంగా ఆ పార్టీ శాసనమండలి సభ్యుడే వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ సోషల్మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మతసామరస్యానికి పాటుపడుతామని బీజేపీ చెప్పే మాటలు ఎవరూ విశ్వసించొద్దని ఆయన సూచించారు.
ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సంఘ్ పరివార్ ప్రాబల్యం అధికంగా ఉండే శివమొగ్గలో పార్టీ గెలిచేందుకు బీజేపీ నాయకత్వం మతకలహాల్ని సృష్టించేందుకు కుట్ర పన్నిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రను గ్రహించి హిందువులు, ముస్లింలు ప్రశాంతంగా ఉండాలని కోరారు.