బహ్రెయిచ్: దేశాన్ని ధనబలంతో తానొక్కటే ఏలాలని బీజేపీ అనుకుంటున్నదని, ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరుస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్నికల అధికారులు వందకుపైగా స్థానాల్లో ఓటింగ్ యంత్రాలను కమలం పార్టీకి అనుకూలంగా మార్చివేశారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంటకు కనీస మద్దతు ధర చట్టం కోసం త్వరలో ఓ ఉద్యమం ప్రారంభించనున్నామని తెలిపారు. రైతులు మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలరని, ఆ దిశగా పనిచేస్తామని చెప్పారు.