చెన్నై: కేంద్రం తీసుకురావాలనుకుంటున్న ఉమ్మడి పౌర స్మృతి(UCC) పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలను ఆ యూసీసీ ప్రణాళికను తప్పుపట్టాయి. యూపీసీని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, నాన్ బీజేపీ రాష్ట్రాలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) అన్నారు. యూసీసీని వ్యతిరేకిస్తున్న వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నట్లు స్టాలిన్ ఆరోపించారు.
తమిళనాడులోని మిత్రపక్షం అన్నాడీఎంకే ఝలక్ ఇచ్చింది. యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కే పళనిస్వామి పునరుద్ఘాటించారు.
మ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్భవన్ సమీపంలో గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆదివాసీ సమన్వయ సమితి(ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్దయెత్తున పాల్గొన్నారు. యూసీసీతో గిరిజనుల ఉనికికి ముప్పు ఏర్పడుతుందని నేతలు పేర్కొన్నారు.