బెంగళూర్ : మైసూర్ ఎయిర్పోర్ట్కు (Mysuru Airport) టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదన కర్నాటక అసెంబ్లీలో శుక్రవారం పెను దుమారం రేపింది. మైసూర్ ఎయిర్పోర్ట్ పేరును టిప్పు సుల్తాన్ ఎయిర్పోర్ట్గా మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎయిర్పోర్ట్ల పేర్ల మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుండటంపై ఈ అంశంపై జరిగిన చర్చలో హుబ్బళి-ధార్వాడ్ (ఈస్ట్) ఎమ్మెల్యే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. చర్చలో పాల్గొన్న అబ్బయ్య హుబ్బళి ఎయిర్పోర్ట్ను తాము సంగొల్లి రాయన్న పేరు పెడతామని ఇక బెలగావి ఎయిర్పోర్ట్కు కిట్టూరి రాణి చెన్నమ్మ, శివమొగ్గ ఎయిర్పోర్ట్కు రాష్ట్ర కవి కెవెంపు, విజయపూర్ ఎయిర్పోర్ట్కు జగజ్యోతి బసవన్న పేర్లు పెడతామని అన్నారు.
సభలోని సభ్యులందరూ ఈ పేర్లను ప్రతిపాదించారని, ఈ సిఫార్సులను సీఎం సిద్ధరామయ్య, మంత్రి ఎంబీ పాటిల్ కేంద్ర ప్రభుత్వానికి పంపుతారని, దీన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. మైసూర్ ఎయిర్పోర్ట్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
Read More :
Airport Metro | ఎయిర్పోర్టు మెట్రో రూటు మార్పుతో కిలోమీటరుకు 50 కోట్లు అదనం!..