INDIA Bloc : రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమిపై బీజేపీ విరుచుకుపడింది. విపక్ష కూటమి రాజకీయంగా మనగలిగే పరిస్ధితి లేదని, కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ మధ్య విభేదాలతో కూటమి అతుకుల బొంతగా తయారైందని కాషాయ పార్టీ ఎద్దేవా చేసింది.
ఇది అసహజ కూటమిగా మారింది..బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎం మమతా బెనర్జీతో విభేదిస్తున్నాయని బెంగాల్ బీజేపీ చీఫ్ సుంకత మజుందార్ ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల అగ్రనేతల మధ్య సామరస్య వాతావరణం ఉన్నా క్షేత్రస్దాయిలో పరిస్ధితి వేరేగా ఉందని అన్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి కలిసి టీ తాగగానే కూటమి బలంగా ఉందని అనుకుంటారని, అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి మాత్రం అలా ఉండదని వ్యాఖ్యానించారు. క్షేత్రస్ధాయి పరిస్ధితి మమతా బెనర్జీకి తెలుసని, రాష్ట్ర కాంగ్రెస్, సీపీఎం దీదీతో పొత్తును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. విపక్ష ఇండియా కూటమికి సారధి ఎవరూ లేరని, దానికి ఓ నేత, సిద్ధాంతం లేదని దుయ్యబట్టారు.
Read More :
Florida Man | మెదడుకు సర్జరీ చేస్తుంటే గిటార్ వాయించాడు..!