న్యూఢిల్లీ: 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రూ.209 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల కమిషన్కు ఖర్చుల వివరాలను సమర్పించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ప్రచారం తదితరాలకు రూ.209.97 కోట్లు ఖర్చు చేసినట్టు ఆ పార్టీ ఈసీకి వెల్లడించింది.
అభ్యర్థుల ఖర్చుల నిమిత్తం రూ.41 కోట్లు కేటాయించగా, రూ.15 కోట్లు ప్రయాణాలకు, ప్రచారం నిమిత్తం రూ.160.62 కోట్లు వ్యయమైందని ఈసీకి తెలిపింది.