Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీకి మావోయిస్ట్ ఆలోచనా విధానం ఉందని బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులపై విచారణ చేస్తానని చెబుతున్న రాహుల్ నేషనల్ హెరాల్డ్ స్కామ్లో తాను కూడబెట్టిన ఆస్తులపై విచారణ జరిపించగలరా అని ఆయన సవాల్ విసిరారు.
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పదేపదే మైనారిటీల గురించి ప్రస్తావించిందని, దేశ వనరులపై ముందుగా మైనారిటీలకు తొలి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అన్నారని పేర్కొంది. ముస్లింలకు అధిక రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ఏపీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గించిందని అన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అసంబద్ధమని హైకోర్టు ఆ నిర్ణయాన్ని రెండుసార్లు కొట్టివేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి ఓట్ల కోసం ఎంతదూరమైనా వెళతారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అందరి బాగు కోసం పాటుపడుతోందని వివరించారు.
Read More :
Bengal teachers | ‘ఆ తీర్పును సవాల్ చేస్తాం’.. బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్