ఖాండ్వా (ఎంపీ), జనవరి 22: ‘రోడ్లు అధ్వాన్నంగా ఉంటేనే ప్రమాదాలు తగ్గుతాయి. రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు పెరుగుతాయి’ అంటూ వింత వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్లోని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు. ఎంపీలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంపై అడిగిన ప్రశ్నకు ఖాండ్వా జిల్లాకు చెందిన మందన ఎమ్మెల్యే నారాయణ పటేల్ సమాధానం ఇస్తూ .. ‘రోడ్లు బాగుంటే వాహనాల స్పీడ్ పెరుగుతుంది… స్పీడ్ పెరిగితే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల సంఖ్య కూడా అధికమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అయితే చాలామంది డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆయన పేర్కొన్నారు.