న్యూఢిల్లీ: బీజేపీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.719.83 కోట్ల విరాళాలు వచ్చాయి. వివిధ సంస్థలు, ఎలక్టొరల్ ట్రస్టులు, వ్యక్తులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నిధులను అందజేశారు.
ఆ పార్టీ సమర్పించిన వివరాలను ఎన్నికల కమిషన్ గురువారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. ప్రుడెంట్ ఎలక్టొరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి రూ.254.75 కోట్లు విరాళంగా అందినట్లు ఈ నివేదిక పేర్కొంది.