ధరలు తగ్గించాలని ఒత్తిడి
సెస్లతో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ ఆదాయం
పలు రాష్ర్టాల స్ట్రాంగ్ రిైప్లె
వ్యాట్ తగ్గించేదే లేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 23: పెట్రోల్, డీజిల్ ధరలను బారాణా పెంచి చారాణా తగ్గించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు వాటిపై వ్యాట్ తగ్గించాలంటూ రాష్ర్టాలతో మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే ఈ ఆటలను బీజేపీయేతర రాష్ర్టాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. కేంద్రానికి, బీజేపీకి ధీటుగా సమాధానం ఇస్తున్నాయి.
వ్యాట్ తగ్గించేదే లేదు..
కేంద్రం పెట్రోల్పై డ్యూటీ తగ్గించడం పూర్తిగా ఎన్నికల జిమ్మిక్కులో భాగం. వ్యాట్ తగ్గించకూడదని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయినా కేంద్రమే ఎక్సైజ్ డ్యూటీతో కోట్లకు కోట్ల ఆదాయం వెనుకోసుకుంటున్నది.
– బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
రాష్ర్టాలు తగ్గించే స్థితిలో లేవు..
వ్యాట్ రూపంలో ఇప్పటికే రాష్ర్టాలకు చాలా తక్కువ ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టాలు ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించలేం. కేంద్రం పన్నులు, ఎక్సైజ్ డ్యూటీలు, సెస్ల రూపంలో భారీగా పన్నులు వసూలు చేస్తున్నది.
– బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్
రూ.500 కోట్లు నష్టం
పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల చత్తీస్గఢ్ ఖజానాకు రూ.500 కోట్లు నష్టం రానున్నది. డ్యూటీ తగ్గించడానికి బదులు వాటిపై విధిస్తున్న సెస్ను తగ్గించాలి.
– ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్
పూర్తి లబ్ధి పొందలేదు..
పెట్రోల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, కేరళ ప్రభుత్వం రాష్ట్ర పన్నులు తగ్గించినా కూడా ఆయిల్ కంపెనీలు బేస్ ప్రైస్ పెంచడంతో ప్రజలకు పూర్తిస్థాయి లబ్ధి చేకూరలేదు. కేంద్రం రూ.8 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రాష్ట్రం రూ.2.41 మేర పన్ను తగ్గించింది. మొత్తం రూ.10.41 మేర ధర తగ్గాలి. కానీ బేస్ ప్రైస్ పెంచడంతో రూ.9.40 మాత్రమే పెట్రోల్ ధర తగ్గింది.
– కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్