ముంబై, సెప్టెంబర్ 21: ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే కేంద్రం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడులను ఎలా తీవ్రతరం చేస్తున్నాయో ఈ రోజు దినపత్రికలను చూస్తే తెలుస్తుందని అన్నారు. బుధవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఎన్నికల ఫలితాలపై సందేహాలు వచ్చినప్పుడు, విపక్ష నేతలపై కేసులు, అరెస్టులు ముఖ్యమైన పనిగా పెట్టుకుంటున్నది.
సమాజంలోని కీలక సమస్యలు, సవాళ్లను పక్కన పెడుతున్నది’ అని విమర్శించారు. వీటిని రాజకీయంగా ఎదుర్కొంటామని పవార్ తెలిపారు. విపక్ష నేతలపై ఉన్న పాత కేసులను సైతం మోదీ సర్కారు తిరగదోడుతున్నదని మండిపడ్డారు. ఇందుకు 2008 నాటి ముంబై పాత్ర చాల్ కేసు ఉదాహరణ అని అన్నారు.