బెంగళూరు, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓ రౌడీషీటర్కు బీజేపీ కండువా కప్పిన ఘటన మరువకముందే.. మరో రౌడీ షీటర్కు పదవి కట్టబెట్టింది కర్ణాటకలోని బీజేపీ సర్కారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ పురపాలక సంఘ సభ్యుడిగా మంజునాథ్ అనే రౌడీషీటర్ను నామినేట్ చేసింది. గత నెల 29న బొమ్మై సర్కార్ గుట్టుగా జారీచేసిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి.
మంజునాథ్ అలియాస్ ఉప్పినకర బాబు ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. మడివాళ పోలీసుస్టేషన్లోని రౌడీషీటర్ల జాబితాలోఆయన పేరు, ఫొటో ఉన్నాయి. కాగా, బీజేపీలో చేరకముందే ఆ రౌడీషీటర్ను మున్సిపాలిటీ సభ్యుడిగా నామినేట్ చేయటం పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇటీవల ఫైటర్ రవి అనే రౌడీషీటర్ను బీజేపీలో చేర్చుకొన్నారు. వారం క్రితం రౌడీషీటర్ సైలెంట్ సునీల్ బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వీ సూర్యతో కలిసి వేదిక పంచుకోవడంపై చర్చ జరిగింది.