ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ్చింది. ఇట్లుంటది బీజేపీ వాళ్లతోటి.. 4 రోజులుగా బెంగళూరు వాసులు కనీవిని ఎరుగని వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిలువ నీడ లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో బాసటగా నిలవాల్సింది పోయి ఇలా ఎంజాయ్ చేస్తావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.