బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya)కు మరోసారి నిరసన సెగ ఎదురైంది. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయనను బ్యాంకు స్కామ్ బాధితులు నిలదీశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బలవంతంగా నిష్క్రమించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సహకార బ్యాంక్ కుంభకోణంలో నష్టపోయిన డిపాజిటర్ల సంఘం సభ్యులు రాజకీయ నేతలతో కలిసి శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతోపాటు, స్థానిక ఎమ్మెల్యే రవి సుబ్రమణియన్, వారి మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, బాధితులకు నష్టపరిహారం అందించడంలో జరుగుతున్న జాప్యంపై డిపాజిటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వి సూర్య ఇచ్చిన సమాధానంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య మద్దతుదారులు అతిగా ప్రవర్తించడంతో ఆ సమావేశంలో గందరగోళం చెలరేగింది. దీంతో సూర్య బలవంతంగా అక్కడి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ను కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ చేసింది. బీజేపీకి చెందిన సూర్య మరోసారి అత్యవసర మార్గం నుంచి వెళ్లిపోయారని విమర్శించింది. ఎన్నికల సమయంలో అహంకారంతో ఓటర్లను తిట్టడంతోపాటు ఆయన మద్దతుదారులు దాడి చేశారని ఆరోపించింది. ఓటర్లు ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ಬಿಜೆಪಿಯ ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ಮತ್ತೊಮ್ಮೆ "ಎಮರ್ಜೆನ್ಸಿ ಎಕ್ಸಿಟ್ ಡೋರ್" ಮೂಲಕ ಜನರಿಂದ ಎಸ್ಕೇಪ್ ಆಗಿದ್ದಾರೆ!
ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣದ ಸಂಸದ 5 ವರ್ಷದುದ್ದಕ್ಕೂ ದೋಸೆ ತಿಂದುಕೊಂಡು, ಫುಟ್ ಬಾಲ್ ಆಡಿಕೊಂಡು, ಮೋಜು ಮಾಡಿಕೊಂಡು ಕಾಲ ಕಳೆದಿದ್ದರು, ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಹಣ ಕಳೆದುಕೊಂಡ ಸಂತ್ರಸ್ತರ ಸಮಸ್ಯೆಯನ್ನು ಒಂದು ದಿನವೂ… pic.twitter.com/2J38A0MANi
— Karnataka Congress (@INCKarnataka) April 15, 2024