రాంచీ: కోపంతో ఊగిపోతూ స్టేజీపైనే యువ రెజ్లర్పై చేయి చేసుకున్నారు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్. బీహార్లోని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఈ ఘటన జరిగింది. 15 ఏండ్లు దాటాడని పోటీల నుంచి ఓ రెజ్లర్ను తప్పించడంతో.. తనను పోటీలకు అనుమతించాలని కోరుతూ అతడు స్టేజిపైకి ఎక్కాడు. పలుమార్లు చెప్పినా అతడు వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన ఎంపీ ఆ యువకుడి చెంపపై కొట్టారు.