బెంగళూర్ : కర్నాటకలో కాషాయ పార్టీ, కాంగ్రెస్ల మధ్య చడ్డీ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ చడ్డీని దేశ ప్రజలు తొలగించారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు కూడా కాంగ్రెస్ చడ్డీని విప్పుతారని బీజేపీ ఎంపీ రమేష్ జిగజినాగి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ చడ్డీల గురించే మాట్లాడుతుంటారని వారు చడ్డీని తప్ప ఇంకేం చూడలేరని ఎద్దేవా చేశారు.
ఆర్ఎస్ఎస్ చర్యలకు నిరసనగా చడ్డీలను దగ్ధం చేస్తామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం కలకలం రేపింది. మరోవైపు రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల కాషాయీకరణకు వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జూన్ 1న తుంకూరులో విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ ఇంటి వద్ద ఖాకీ షార్ట్స్ను దగ్ధం చేయడంతో చడ్డీ వివాదం తెరపైకి వచ్చింది.
ఇక సిద్ధరామయ్య హెచ్చరికల నేపధ్యంలో కాంగ్రెస్ కార్యాలయానికి పంపేందుకు నిక్కర్లను సేకరించింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎలాంటి అంశాలు లేకపోవడంతో కాంగ్రెస్ చడ్డీ వివాదాన్ని ఎంచుకుందని మంత్రి నాగేష్ ఆరోపించారు.