జైపూర్: రాజస్థాన్లోని ప్రతాప్ఘడ్ జిల్లాలో బీజేపీ ఎంపీ సీపీ జోషి.. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లిన ఆ ఎంపీ.. తోటి ఉద్యోగుల ముందే ఒకర్ని కొట్టారు. రైతుల వద్ద నుంచి 5వేల లంచం తీసుకున్నట్లు ఓ ఉద్యోగిపై ఆరోపణలు వచ్చాయి. సదురు ఉద్యోగిని పిలిపించిన ఎంపీ సీపీ జోషి అతన్ని ప్రశ్నించారు. రైతులు, ఉద్యోగుల ముందే లంచం అడిగిన ఉద్యోగి చెంప చెల్లుమనిపించారు ఎంపీ.
सांसद ने खोया आपा…जड़ दिया तमाचा ! Video Viral#ViralVideo @Payodhi_Shashi @avasthiaditi pic.twitter.com/h1pYqxIr0t
— Zee News (@ZeeNews) November 3, 2022
భూ పట్టాలను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఓ ఉద్యోగి రూ.5వేల లంచం అడిగినట్లు రైతులు ఆరోపించారు. ఇక ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో.. 15వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు ఆరోపించారు. డిపార్ట్మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవడం వల్ల ఆ ఎంపీపై విమర్శలు వస్తున్నాయి.