న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న పలు స్కాలర్షిప్లను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రద్దు చేసిన ఫెలోషిప్లు, స్కాలర్షిప్లను పునరుద్ధరించాలని బీజేపీ ఎంపీ ప్రీతం ముండే డిమాండ్ చేశారు.
ఉన్నత చదువులు చదివే మైనార్టీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ ఫెలోషిప్ను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. అలాగే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ను కూడా 1-8 తరగతులకు రద్దు చేసిన సంగతి విదితమే.